ఏపీలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విలయం

  • గత 24 గంటల్లో 75 మంది మృతి
  • 10,199 మందికి కరోనా పాజిటివ్
  • తాజాగా 9,499 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ విశృంఖలంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 10,199 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 75 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,65,730కి చేరగా, మరణాల సంఖ్య 4,200కి పెరిగింది. తాజాగా 9,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా నయం అయినవారి సంఖ్య 3,57,829గా నమోదైంది. ఇంకా, 1,03,701 మంది చికిత్స పొందుతున్నారు.

Corona Virus
Deaths
Positive Cases
Andhra Pradesh
COVID-19

More Telugu News